Saturday, April 20, 2024
- Advertisement -

చీఫ్ సెల‌క్ట‌ర్ ఎంఎస్‌కే ప్రసాద్ పై అంబ‌టి రాయుడు 3డీ సెటైర్‌…

- Advertisement -

ప్ర‌పంచ క‌ప్‌కు 15 మందితో బీసీసీఐ ప్ర‌క‌టించిన భార‌త జ‌ట్టులో స్థానం ద‌క్క‌క‌పోవ‌డంపై అంబ‌టి రాయుడి చీఫ్ సెల‌క్ట‌ర్‌ ఎంఎస్‌కే ప్రసాద్ పై ఫైర్ అయ్యారు. వచ్చే వరల్డ్‌కప్‌ను ‘3డీ’ కళ్లద్దాలు పెట్టుకుని చూస్తానంటూ ఈరోజు ట్వీట్ చేశాడు. తనను కాదని, ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను జట్టులో ఎంపిక చేయడానికి ఎంఎస్‌కే ఇచ్చిన వివరణ రాయుడికి మరింత ఆగ్రహం తెప్పించింది.

విజయ్‌ శంకర్‌ త్రీ డైమెన్షన్స్‌ ఉన్న ఆటగాడిగా ఎంఎస్‌కే పోల్చిన క్రమంలో రాయుడు సెటైర్‌ వేశాడు. ‘ నేను ఇప్పుడు త్రీడీ కళ్లద్దాల కోసం ఆర్డర్‌ చేశా. వచ్చే వరల్డ్‌కప్‌ను ఆ గ్లాసెస్‌తోనే చూడాలనుకుంటున్నా’ అంటూ ట్వీటర్‌ వేదికగా చురకలంటించాడు. రాయుడి ట్వీట్ కు అభిమానులు మ‌ద్ద‌తు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -