Monday, April 29, 2024
- Advertisement -

వివాహేత‌ర సంబంధం..భ‌ర్త‌, ఇద్ద‌రు ప్రియ‌ళ్లు మ‌ధ్య‌లో భార్య‌…చివ‌ర‌కు ఏమ‌య్యిందంటే..?

- Advertisement -

దేశంలో ప్ర‌తీరోజు అక్ర‌మ సంబంధాలు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. వాటి వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. తాజాగా అలాంట సంఘ‌ట‌నే మ‌రొక‌టి వెలుగులోకి వ‌చ్చింది. భర్త ఉండ‌గానే మ‌రో ఇద్ద‌రితో వివాహేత సంబంధం పెట్టుకొంది మ‌హిళ‌. తనతో కాకుండా మరో వ్యక్తితో కూడా సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకున్న మొదటి ప్రియుడు ఆమెపై కత్తితో దాడి చేశారు. ఈ సంఘ‌ట‌న క‌ర్నాట‌క‌లో చోటు చేసుకుంది.

బెంగళూరుకు సమీపంలోని బెళత్తూరులో మంజుల అనే వివాహిత ఉంటోంది. ఆమెకు భర్త మంజునాథ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆటో డ్రైవ‌ర్ రాజ‌శేఖ‌ర్‌తో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. అయితే ఇటీవలి కాలంలో మంజుల స్థానికంగా ఉండే సురేశ్ తో చనువుగా ఉంటోంది. దీన్ని చూసి త‌ట్టుకోలేని ప్రియుడు నిన్న సాయంత్రం రోడ్డుపై వెళుతుండగా ఆమెను అడ్డగించాడు. వెంట తెచ్చుకున్న కత్తితో మంజుల కడుపులో పొడిచాడు. అనంతరం గొంతు కోసి ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.వెంటనే స్థానికులు ఆమెను హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మెరుగైన చికిత్స కోసం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిండితుడ్ని చూడాపురం గ్రామానికి చెందిన రాజశేఖర్‌గా గుర్తించారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -