ప్రేమోన్మాదానికి మరో యువతి బలి అయ్యింది. అనుమానంతో ప్రేమించిన యువతిని కిరాతకంగా గొంతు కోశాడో నీచుడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు ఉన్మా ది. ఈ దారుణమైన సంఘటన గుంటూరులో చోటు చేసుకుంది. మంగళగిరిలో జ్యోతి హత్య ఇన్సిడెంట్ మరిచికపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెల్తే…. గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటకు చెందిన జ్యోతి తండ్రి..సత్యనారాయణ ఫ్రెండ్స్. సత్యనారాయణ కన్ను జ్యోతిపై పడింది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లు సహజీవనం చేశారు. జ్యోతి మరో కరితో ఫోన్లో మాట్లాడుతోందని..ఛాటింగ్ చేస్తోందని సత్యనారాయణ అనుమానించాడు. ఆ అనుమానం మరింత పెరిగింది. దీంతో చంపేయాలని నిర్ణయించుకున్న సత్యనారాయణ..ఫిబ్రవరి 21వ తేదీ గురువారం జ్యోతి ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న సత్యనారాయణ అక్కడకు వెళ్లాడు. అక్కడ వారిమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయిన సత్యనారాయణ తనతో పాటె తెచ్చుకున్న కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. మెడపై తీవ్రగాయం కావడంతో జ్యోతి అక్కడికక్కడనే కుప్పకూలి చనిపోయింది. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
సత్యనారాయణకు ఇది వరకే పెళ్లి అయినట్లు తెలుస్తోంది. అతని అలవాట్లు, ప్రవర్తన మార్చుకోవాలని భార్య సూచించినా మార్పు రాకపోవడంతో ఆ ఇల్లాలు భర్తను వదిలేసి వెళ్లిపోయింది. భార్య లేకపోవడంతో తనను అడిగేవారు లేకపోవడంతో ఊరి మీద పడి విచ్చలవిడిగా తిరిగేవాడు. ఈ క్రమంలోనే జ్యోతితో పరిచయం .. వివాహేతర సంబంధం ఏర్పడడానికి దారితీసింది. చివరకు అతని చేతిలోనె హతం అయ్యింది.