Monday, April 29, 2024
- Advertisement -

అక్ర‌మం సంబందానికి అడ్డు వ‌స్తున్నాడ‌ని మామ‌ను చంపిన‌ కోడ‌లు, ప్రియుడు

- Advertisement -

భారతదేశంలో వివాహ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత వుంది. కాగా ఇటీవలి కాలంలో వివాహ వ్యసవ్థకు తూట్లుపడే సంఘటనలు కోకొల్లలుగా బైటపడుతున్నాయి. కారణం ఏదైనా గానీ..వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడనే నెపంతో ప్రియుడితో కలిసి తన భర్త తండ్రి(మామ)ను హతమార్చిన సంఘ‌ట‌న బాన్స్‌వాడ స‌మీపంలోని రాంపూర్ లో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెల్తే…ఈ నెల 22న గ్రామంలోని బీర్కూర్ గంగారాం (60) అనే వృద్ధుడు హత్యకు గురికాగా, విచారణ జరిపిన పోలీసులు విస్తుపోయే నిజాలను వెలికితీశారు. లావణ్య అనే యువతికి విఠల్ అనే అమాయ‌కుడితో వివాహం జ‌రిగింది. భ‌ర్త అమాయ‌క‌త్వాన్ని ఆస‌రా చేసుకొని పక్క ఇంట్లో ఉండే పృథ్వీరాజ్ అలియాస్ రాజుతో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. వీరి అక్ర‌మ‌సంబందం మామ గంగారాంకు తెలియ‌డంతో ఇద్ద‌రినీ మంద‌లించాడు. త‌మ వివాహేత‌ర సంబంధానికి అడ్డు వ‌స్తున్నాడ‌న్న కార‌ణంతో గంగారాంను మ‌ర్డ‌ర్ చేసేందుకు ప్లాన్ వేశారు.

తన సెల్ ఫోన్ నుంచి రాజుకు మెసేజ్ పంపి, తన మామను హత్య చేయాలని కోరింది. కుంట్లమోరి వంతెన నిర్మాణ పనుల్లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న గంగారాం వద్దకు వెళ్లిన రాజు, నిద్రిస్తున్న అతనిపై కత్తితో దాడి చేశాడు. మెడపై నరకడంతో చనిపోయాడు. హత్య జరిగిన తెల్లా రి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీంచారు. నిందితుడి వద్ద ఉన్న చైన్‌ను పసి గట్టి, ఆ చైన్‌ ఆధారంగా, ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు పోలీసులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -