- Advertisement -
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ఎవరిని నియమించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ప్రస్తుతమున్న గవర్నర్ రఘు రామరాజును కొనసాగించాలా వద్దా అనే అంశంపై కూడా ఈ కమిటీ ఓ నివేదిక ఇస్తుంది. ఈ కమిటీకి క్యాబినెట్ కార్యదర్శ కె.సిన్హా నేత్రత్వం వహిస్తారు.
ముందుగా ఆర్ బి ఐ గవర్నర్ గా చేసేందుకు అర్హతలున్న వారి జాబితాను తయారు చేస్తారు. దీన్ని పరిశీలించిన తర్వాత గవర్నర్ ను నియమిస్తారు. ఇంతకు ముందు ప్రధానమంత్రి, ఆర్ధిక మంత్రితో సంప్రదించిన తర్వాత ఆర్ బి ఐ గవర్నర్ ను నియమించే వారు. ఆ సంప్రదాయానికి బిజెపి ప్రభుత్వం తోసిరాజని కొత్తగా కమిటీని నియమించింది.