- Advertisement -
భారత వాయుసేనకు శిక్షణ విమానం మీరేజ్ 2000 విమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు శిక్షణ పొందుతన్న పైలెట్లు దుర్మరణం చెందారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) విమానాశ్రయం వద్ద శుక్రవారం (ఫిబ్రవరి 1) ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
టేకాఫ్ తీసుకుంటుండగానే ఈ శిక్షణా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు సమాచారం. అనంతరం మంటల్లో కాలిపోతూ.. కూలిపోయింది. తీవ్ర గాయాల పాలైన పైలట్లు ఇద్దరూ విమానం నుంచి ఏజెక్ట్ అయ్యారు. మృతి చెందిన శిక్షణా పైలట్లను నేగి, అబ్రోల్గా అధికారులు గుర్తించారు.