Wednesday, May 8, 2024
- Advertisement -

2019 లో ప్రధాని ఎవరో తేలిపోయింది

- Advertisement -

దేశ యువత పేరుతో 2019లో భారత దేశ ప్రధాని అన్న అంశంపై తాజాగా ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో ప్రధాని మోడీనే మరోసారి ప్రధాని అవుతారని మెజార్టీ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.

ఆన్ లైన్ పోల్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో తర్వాతి ప్రధానిగా మోడీనే సమర్ధుడైన నేతగా అత్యధికులు అభిప్రాయపడటం విశేషంగా చెప్పాలి. గడిచిన రెండున్నరేళ్లుగా మోడీ పాలనపై ప్రజలు సంతృప్తికరంగా ఉండటంతో పాటు.. 2019లో నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో మోడీని మరోసారి ప్రధానిగా చూడాలన్న ఆలోచనలో 70 శాతం మంది ప్రజలు ఉన్నట్లుగా తాజా సర్వే స్పష్టం చేసింది. ఆసక్తికరమైన మరో అంశం ఏమిటంటే.. తాజాగా నిర్వహించిన సర్వేలో పురుషులతో పాటుమహిళలు కూడా అత్యధికంగా పాల్గొన్నట్లుగా చెబుతున్నారు.

సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది తమ తదుపరి ప్రధానిగా మోడీని ఎన్నుకోవటానికి ఎలాంటి తడబాటుకు గురికామని.. మరో ఆలోచన చేయమని తేల్చి చెప్పేయటం విశేషం. తాజా సర్వేలో 70 శాతం మంది మోడీని 2019 ప్రదానిగా అంగీకరించటం ఒక ఎత్తు అయితే.. సర్వేలో పాల్గొన్న వారిలో 64 శాతం మంది మహిళలు మోడీకి తమ మద్ధతు ఉంటుందని తేల్చి చెప్పారు.

Related 

  1. మోడీ ని వశం చేసుకుంటున్న కెసిఆర్ ?
  2. వాళ్ళు తెలంగాణా లో రేపు మోడీ కి చుక్కలు చూపించబోతున్నారు
  3. మోడీ ని పోట్టచక్కలు అయ్యేలా నవ్వించిన చంద్రబాబు – ఎంపీ
  4. సోనియా గాంధీ కి జ్వరం – మోడీ ఓవర్ యాక్షన్
  5. పవన్ కళ్యాణ్ ని వశం చేసుకోవడం కోసం బీజేపీ ప్లాన్ లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -