ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన లయన్ ఎయిర్ బోయింగ్ 737 విమానం సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 189 మంది ప్రయాణికులు జల సమాధి అయ్యారు. జకార్తా నుంచి పినాంగ్ వెళుతున్న లయన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు.
ఆ సమయంలో విమానం సముద్రం మీది నుంచి ప్రయాణిస్తోంది. సముద్రంలో విమాన శకలాలు కూడా లభ్యమయ్యాయి. ప్రమాదానికి గురైన విమానంలో 189 మంది ప్రయాణీకులు, సిబ్బంది ఉన్నారు. విమానంలోని అందరూ జలసమాధి అయినట్లు భావిస్తున్నారు.
విమానంలోని ప్రయాణీకుల సీట్లు సముద్ర జలాలు తేలియాడుతూ కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానంలో 177 మంది పెద్దలతో పాటు ముగ్గురు పిల్లలు, ఇద్దరు పైలెట్లు, ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Serpihan pesawat Lion Air JT 610 yang jatuh di perairan Karawang. Beberapa kapal tug boad membantu menangani evakuasi. Video diambil petugas tug boad yang ada di perairan Karawang. pic.twitter.com/4GhKcRYkpG
— Sutopo Purwo Nugroho (@Sutopo_PN) October 29, 2018