- Advertisement -
రైల్వేశాఖ అధికారిక వెబ్సైట్ ఐఆర్సీటీసీ కార్యకలాపాలు రెండు గంటలపాటు స్థంభించనున్నాయి. ఈ నెల 10వ తేదీన అర్థరాత్రి 12.20 నిమిషాల నుంచి తెల్లవారుజామున 1.30 వరకూ అన్ని సేవలు నిలిచిపోతాయని రైల్వేశాఖ పేర్కొంది. రోజువారీ సైట్ నిర్వహణలో భాగంగా రెండు గంటలపాటు టికెట్ బుకింగ్స్ నిలిచిపోనున్నాయని భారతీయ రైల్వేశాఖ వెల్లడించింది.
ఇలా నిలిచిపోనున్న సేవల్లో ఇంటర్ నెట్ బుకింగ్, ఫోన్ సర్వీసులు, ఇతర రిజర్వేషన్ సేవలు పనిచేయవని స్పష్టం చేసింది. కాబట్టి ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.