హైదరాబాద్ నగరం ఉగ్రవాదుల అడ్డాగా మారిన సంగతి తెలిసిందే. ఇక్కడికి ఎవరైనా వచ్చి వెళ్లొచ్చు. యథేచ్ఛగా ఏదైనా చేసుకోవచ్చు. అందుకే దిల్షుక్ నగర్ పేలుళ్లు, మక్కా మసీద్ పేలుళ్లు సంభవించాయి. చరిత్రలో ఎన్ని గుణపాఠాలున్నా మనం మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతున్నా అలెర్టు కాలేకపోతున్నాం. అందుకే ఏకంగా పాతబస్తీలో ఐసిస్ ఉగ్రవాదులు తిష్ఠవేశారు.
కాస్తంత ఎన్ఎస్జీ అప్రమత్తతో పట్టుకున్నారే కానీ మన పోలీసుల వల్ల అయితే కానేకాదు.లేటెస్టుగా మరోసారి ఐసిస్ కార్యకలాపాలకు మూలం హైదరాబాద్ పరిసరాల్లో ఉందంటూ కలకలం రేగుతోంది. ఐసిస్ కాలేజీ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటోందన్నది ఓ యువకుడి ఆరోపణ. కాలేజ్ లెక్చరర్ ప్రవీణ్కుమార్ (28) తన ఫేస్ బుక్ పేజీలో ఐసిస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన 30 పోస్ట్ లు చేయడం పలు అనుమానాలకు తావిచ్చింది.
ఎంఎస్ కళాశాలలో ఉగ్రవాద శిక్షణ అంటూ అతడు కలకలం రేపారు. అయితే ఇలా పోస్టింగులు చేసిన కొన్ని గంటల్లోనే వరంగల్ జిల్లా ఎంజీఎం సెంటర్ వద్ద లారీ యాక్సిడెంట్లో ప్రవీణ్ మరణించడం ఓ మిస్టరీగా మారింది. కాలేజ్ యాజమాన్యం ఈ విషయాన్ని ఖండిస్తున్నా.. ప్రవీణ్ మర్డర్ ఓ మిస్టరీగా మారడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తనపై మర్డర్ ఎటెంప్ట్ జరుగుతుందని ప్రవీణ్ ముందే చెప్పడం ఇక్కడో హైలైట్.