Saturday, May 18, 2024
- Advertisement -

నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెల్లిన పీఎస్ఎల్‌వీ-సి40 రాకెట్ …

- Advertisement -

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మ‌రో మైలు రాయిన అందుకుంది. నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్ఎల్వీ సి40 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెల్లింది. పీఎస్‌ఎల్‌వీ-సి40 రాకెట్ ద్వారా మూడు స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలతో కలిపి 31 ఉగ్రహాలను కక్ష్యలోకి పంపింది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2ఇ, ఒక నానో శాటిలైట్‌, ఒక సూక్ష్మ ఉపగ్రహం ఉన్నాయి.

తాజా ప్రయోగంతో భారత్‌కు చెందిన మొత్తం వంద ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్లవుతుంది. 2018లో ఇదే మొదటి ప్రయోగం, గత ఆగస్టులో ఇస్రో చేపట్టిన ప్రయోగం విఫలం కావడంతో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గతేడాది ఆగస్టు 31 న పీఎస్‌ఎల్‌వీ-సి 39 ప్రయోగం విఫలమవడంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టును భారతీయ శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకున్నారు. నాటి ప్రయోగంలో రాకెట్లో ఉష్ణకవచం తెరుచుకోకపోవడంతో విఫలమైనట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు, తర్వాత నాలుగు నెలల పాటు ఎలాంటి ప్రయోగం నిర్వహించలేదు.

గత ఏడాది ఫిబ్రవరిలో ఒకే రాకెట్‌ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన భారత్ ఈ విజయంతో అమెరికా, రష్యాల సరసన చేరింది. గతంలో అమెరికా 29, రష్యా 37 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించాయి. ఆ రికార్డులను సైతం భారత్‌ బద్దలు కొట్టడమే కాకుండా భవిష్యత్తులో ఎవరూ అందుకోని ఎత్తునకు ఎదిగింది. ఈసారి మొత్తం 31 ఉపగ్రహాలు ప్రయోగిస్తుండగా, వాటిలో 28 విదేశాలకు చెందినవే కావడం గమనార్హం.

భారత ఉపగ్రహాల్లో కార్టోశాట్-2 ఈఆర్ ఉంది. ఈ ఉపగ్రహం సహాయంతో తుపాన్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తం 1323 కిలోల బరువును ఉపగ్రహవాహక నౌక తనతో పాటు తీసుకెళుతోంది. కార్టోశాట్-2 ఉపగ్రహం బరువు 710 కిలోలు. ప్రస్తుతం పీఎస్ఎల్వీ మూడవ దశ విజయవంతంగా ముగిసింది. రాకెట్ తన లక్ష్యం దిశగా దూసుకెళుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -