- Advertisement -
గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు సమాచారం. కారణం.. గీతగోవిందం సినిమా అని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ గీత గోవిందం సినిమాను తెరకెక్కించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు పరుశురాం తెరకెక్కించారు. ఈ మూవీ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధించింది. విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన హీరోగా మారిపోయాడు.
అయితే ఈ మూవీ ఈ నేపథ్యంలో గీతగోవిందం సినిమా వసూళ్ల లెక్కలు తేల్చేందుకు ఐటీ అధికారులు జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ 2 కార్యాలయంలో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపు పన్ను చెల్లించారా లేదా అనే విషయంలో అధికారులు డాక్యుమెంట్స్ పరిశీలించినట్లు తెలుస్తోంది.