ఏపీలో 2019 ఎన్నికల సమరం కోసం టీడీపీ, వైసీపీ.. తీవ్ర స్థాయిలో కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ రెండు పార్టీలు.. తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. టీడీపీ పార్టీ క్యాడర్ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఏపీ సీఎం.. టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పిలుపునిచ్చారు. త్వరలోనే ఎన్నికలు ఉన్నాయని.. మరెంతో దూరం లేవని లీకులిచ్చి ఎన్నికల కోసం సమర శంఖం పూరించాలని సూచించారు.
ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలను నిర్వాహించాలని.. తాను కూడా ఇప్పటి నుంచి పార్టి కి ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పారు. సాయంత్రం ఆరు గంటల నుంచి పార్టీ వ్యవహారాల పైన ప్రత్యేకంగా దృష్టి పెడతానని చెప్పారు. గతేడాదితో పోల్చుకుంటే టిడిపి ఓట్ల శాతం 16.13 మేర పెరిగిందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల ఓట్ల శాతం 13.45 మేర తగ్గిందని ఈ శాతాన్ని మరింతగా పెంచాలని చంద్రబాబు గట్టిగానే పోరాడుతున్నారు. అయితే జగన్ కూడా..టీడీపీకి మించి ఎన్నికల కసరత్తులు మొదలుపెట్టారు.
{loadmodule mod_custom,Side Ad 1}
ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలన్న దానిపై ఎప్పటి నుంచో కసరత్తులు చేస్తున్న జగన్.. క్యాడర్ ని బలోపేతం చేసేందుకు వారిలో ధైర్యాన్ని ఎన్నికల ఊపును నింపేందుకు యాత్రలు కూడా చేపట్టారు. అయితే 2019 ఎన్నికల మేనిఫెస్టోపై కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ ఐదు సంతలకాలతో ఏపీ కొత్త చరిత్ర నిర్మించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఆ సంతకాలు ఏంటీ అన్నాదానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ ఐదు సంతకాలు ఇవే అని తెలుస్తోంది.
1.అమ్మఒడి
2.పెన్షన్లు
3.ధరల స్దీరీకరణ
4.డ్వాక్రా రుణాల రద్దు
5.ఊరురా రాజన్న సేవా కేంద్రాలు
{loadmodule mod_sp_social,Follow Us}
Related