Thursday, May 23, 2024
- Advertisement -

బాబు సింగపూర్ కాదు.. హైదరాబాద్ కూడా కట్టలేడంటున్న టీడీపీ నేత!

- Advertisement -

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏమో నవ్యాంధ్రకు రాజధాని నిర్మిస్తాను అంటున్నాడు. అంతర్జాతీయ స్థాయి నగరాన్ని ఏపీలో నిర్మింపజేస్తానని ప్రకటించుకొన్నాడు. అది సింగపూర్ స్థాయిలో ఉంటుందని చెబుతున్నాడు.

ఇలా చెప్పడంలోనే ఆయన ఒక ఏడాదిని పూర్తి చేశాడు. మరి ఈ విషయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక తెలుగుదేశం నేత కూడా బాబు సామర్థ్యాన్ని శంకించాడు!

చంద్రబాబు సింగపూర్ కాదు.. హైదరాబాద్ స్థాయి నగరాన్ని కూడా కడతాడంటే తాము నమ్మలేమని ఆయన తేల్చేశాడు. బాబు ప్రభుత్వంలో ఒకడి ఉన్నా తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్య చేశాడు. కుండబద్ధలు కొట్టినట్టుగా మాట్లాడే స్వభావం ఉన్న ప్రభాకర్ రెడ్డి ఇలా మాట్లాడాడు. తెలుగుదేశాధినేతవి అన్నీ ఉత్తుత్తి కబుర్లే అన్నట్టుగా ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పాడు!

మరి జేసీ సోదరులు బాబు విషయంలో ఈ తరహా అసంతృప్తి వ్యక్తం చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలుమార్లు..వివిధ అంశాల గురించి వీరు బాబుపై విరుచుకుపడ్డారు. బాబు కొత్త హామీలు ఇవ్వకుండా.. ఎన్నికల ముందు ఇచ్చినహామీలను నిలబెట్టుకొంటే చాలన్నట్టుగా వీరు మాట్లాడారు. అలాగే రాయలసీమకు, అనంతపురం జిల్లాకునీళ్లను అందించడంపై దృష్టి నిలపాలని లేకపోతే.. మళ్లీ ఎన్నికల్లో గెలవడం కూడా కష్టం అవుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి బాబుకు హెచ్చరిక జారీ చేశాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -