ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన జ్యోతి హత్య కేసు మిస్టరీ వీడింది.జ్యోతిని తన బైక్ పై ఎక్కించుకుని వెళ్లిన ప్రియుడు శ్రీనివాసే ప్రధాన నిందితుడని తేల్చారు గుంటూరు పోలీసులు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని పోలీసులు తెలిపారు. ముందుగా అనుమానిస్తున్నట్లుగానే జ్యోతిని ఆమె ప్రియుడు శ్రీనివాసే హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. ప్రస్తుతం శ్రీనివాస్ ఆస్సత్రిలో చికిత్స పొందుతుండటంతో అతడు డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
జ్యోతిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న శ్రీనివాస్.. ఆమె పెళ్లి చేసుకోవాలని కోరడంతోనే స్నేహితుడి సాయంతో హతమార్చినట్లు తేల్చారు. జ్యోతి కాళ్లు చేతులను శ్రీనివాస్ పట్టుకోగా.. అతడి ఫ్రెండ్ పవన్ ఆమె తలపై బలంగా కొట్టాడని పోలీసులు తెలిపారు. తీవ్ర రక్త స్రావంతో జ్యోతి అక్కడికక్కడే చనిపోగా….తనమీద అనుమానం రాకుండా తన తలపైన కూడా పవన్తో కొట్టించుకున్నాడని పోలీసులు వెల్లడించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడుకు చెందిన చుంచు శ్రీనివాసరావు (26), అంగడి జ్యోతి (24) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మన స్పర్థల కారనంగా కొంత కాలం శ్రీనివాస్కు దూరంగా ఉన్న జ్యోతి ఇటీవలే దగ్గరైనట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ జ్యోతిని శారీరకంగా వాడుకున్నాడు. పెళ్లి చేసుకోమని జ్యోతి ఒత్తిడి చేయడంతో ఆమెకు సంబందించిన నగ్నవీడియోలు బయట పెడతానని హెచ్చరించినా జ్యోతి వినకపోవడంతో జ్యోతి అడ్డు తొలగించుకొనేందుకు మంగళగిరి సమీపంలోని ఉడా టౌన్షిప్ సమీపానికి తీసుకెళ్లి ఫ్రెండ్ సాయంతో హతమార్చాడు. ఈ కేసులో ఇప్పటివరకు శ్రీనివాస్ స్నేహితులు శశి, పవన్ అనే ఇద్దరు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మ పేరుతో పలువురు యువతులను కూడా శ్రీనివాస్ మోసం చేశాడని పోలీసులు చెప్పారు.నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువతుల నగ్న వీడియోలు తీసి…వాటిని చూపిస్తూ బ్లాక్మొయిల్ చేసేవాడని తేలింది. పథకం ప్రకారమే అమరావతి టౌన్షిప్లో జ్యోతిని శ్రీనివాస్ హత్య చేశాడని, వారం ముందే శ్రీనివాస్, స్నేహితుడు పవన్ కలిసి హత్యకు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది