ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ప్రజా సమస్యలు ఎక్కడ క్కడనే ఉన్నాయి. ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి తీరా అధికారలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చడంలో మీనవేషాలు వేస్తూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాసమస్యలపై దృష్టి పెట్టకుండా సొంత పార్టీ అభిప్రాయాలకే సమయం కేటాయిస్తున్నారు. పార్టీ అధికార అండ చూసుకొని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నిక విషయంలో అధికారం ఉదనే ధీమాతో ప్రజా స్వామ్యవిలువలను తుంగలోకి తొక్కి ఛైర్మెన్ ఎన్నికను ఏవిధంగా వాయిదా వేశారో అదరికీ తెలిసిందే.
ఇక చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై జగన్ అలు పెరుగని పోరాటం చేస్తుండటంతో చంద్రబాబుకు కంటిమీద కునుకేలేకుండా చేస్తున్నారో ..అదేవిధంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి కూడా చుక్కులు చూపిస్తున్నారు. ఇటీవల ప్రాంద్దుటూరు మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నికల్లో టీడీపీ తమ్ముల్లు దైర్జన్యపూరితంగా వాయిదా వేయించడంపై తీవ్ర అసహనానికి లోనయిన రచమల్లు ప్రసాద్రెడ్డి చెప్పుతో కొట్టొని తెలిపిన నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.
ఇది మరవకు ముందే తాజాగా మరో కొత్తగా వచ్చిన స్టాప్ నర్సులను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రి ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వం స్టాఫ్ నర్సులను విధుల్లోకి తీసుకోకుంటే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చిరించారు. ఉద్యోగ,ప్రజాసమస్యలమీద వైసీపీ చేస్తున్న పోరాటం వల్ల బాబుకు దిక్కుతచని పరిస్తితుల్లో ఉన్నారు.కడప జిల్లాలో జగన్కు చెక్ పెట్టాని వేస్తున్న ఎత్తులు చిత్తవుతున్నాయి.
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైసీపీకీ వారినుంచి మద్దతు అనూహ్యంగా పెరుగుతోంది. నియేజక వర్గంలోని సమస్యలపై ప్రజల తరుపున స్థానికి ప్రజాప్రతినిధి ధర్నాకు దిగడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తంచేస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ …ప్రజల సమస్యలమీద నిరంతరం పోరాటం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు.2019 ఎన్నికల్లోనూ రాచమల్లుప్రసాద్రెడ్డే గెలవడం పక్కా కాయం అని కడప విస్లేషకులు అంచనా వేస్తున్నారు.
Related