Thursday, May 9, 2024
- Advertisement -

600 దొంగతనాలు…7 మిస్టరీ మర్డర్లు …సైకో కిల్ల‌ర్

- Advertisement -

600 దొంగతనాలు, 7 హత్యలు, ఫరిదాబాద్‌, పల్వాల్‌, కురుక్షేత్ర, పంజాబ్‌ ప్రాంతాల్లో ప్రజలకు వణుకు పుట్టించాడు ఓ సైకో కిల్ల‌ర్ . చివ‌ర‌కు పాపం పండ‌టంతో క‌ట‌క‌టాల పాల‌య్యాడు. క్రైం రికార్డ్ కలిగిన ఈ దొంగ మాత్రం కాళీ మాతకు పరమ భక్తుడు. చేసే నేరాలు, హత్యలు చేస్తాడు. చేసేముందు కాళీమాతకు జపం చదువుతాడు. చేస్తున్నదాన్ని మన్నించమని కోరుతాడు. అనంతరం దారుణానికి ఒడిగడతాడు

వ‌రుస దొంగ త‌నాలు, హ‌త్య‌ల‌తో ప్ర‌జ‌ల‌కు, పోలీసుల‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిన సైకో కిల్ల‌ర్‌ను ఎట్ట‌కేల‌కు పోలీసులు అరెస్ట్ చేశారు. గ‌త కొద్ది రోజులుగా పోలీసుల‌ను ముప్ప తిప్ప‌లు పెట్టాడు. చిర‌వ‌కు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని జగ్తార్‌ సిన్హాగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచార‌ణ‌లో సైకో కిల్ల‌ర్ చెప్పిన విష‌యాల‌తో పోలీసులు షాక్ తిన్నారు

600 దొంగతనాలు చేసినట్లు అంగీకరించిన నిందితుడు.. ఈ క్రమంలో ఏడుగురిని కిరాతకంగా హత్యచేశానని ఒప్పుకున్నాడు. నిందితుడు హత్య చేసే ముందు, తన పాపాలకు ప్రాయశ్చితంగా కాళీ మాత మంత్రాలతో 108 సార్లు జపం చేస్తాడని డీసీపీ లోకేంద్ర సిన్హా మీడియాకు తెలిపారు.

ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో నిందితుడు మీడియాతో మాట్లాడుతూ.. తాను హత్యలు చేసేముందు 108 సార్లు కాళిమాత మంత్రాలతో జపం చేస్తానని తెలిపాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తంగానే ఈ జపం చేస్తానన్నాడు. ప్రస్తుతం నిందితుడిని కోర్టు ముందు హాజరుపర్చి రిమాండ్ కు తరలిస్తామని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -