- Advertisement -
గత కొన్ని రోజులుగా దేశంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో.. నదులు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడ చూసిన నీరే కనిపిస్తోంది. దీంతో మూగ జీవాలు జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. గుజరాత్ లోని జనావాసాల్లోకి మొసళ్ళు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 25 మొసళ్లను అధికారులు పట్టుకున్నారు.
కర్నాటకలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. బెల్గాం జిల్లాలోని రాయ్బాగ్ తాలుకా పరిధిలోని ఓ గ్రామంలోకి మొసళ్లు వచ్చాయి. వరద నీరు ఇళ్లను ముంచెత్తడంతో.. మొసళ్లు ఇండ్ల కప్పులపై సేద తీరుతున్నాయి. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.