- Advertisement -
గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు సహా విభజనాంశాలపై ఇవాళ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. హైదరాబాద్ ప్రగతిభవన్ వేదికగా కేసీఆర్, జగన్ భేటీ జరగనుంది. దీనిలో భాగంగా సీఎం జగన్ హైదరాబాద్ చేరుకున్నారు.ఉదయం 9:50 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10:40 గంటలకు బేగంపేటకు చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా లోటస్ పాండ్ లోని తన ఇంటికి వెల్లనున్నారు.
మధ్యాహ్నం సీఎం కేసీఆర్ తో ప్రగతీ భవన్ లో చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్ కు మళ్లించడానికి తెలంగాణ తరపున ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. పోలవరం బ్యాక్ వాటరే మార్గమని నిర్ణయానికి వచ్చారు. ఇవాల్టి ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ విషయం ప్రస్తావించనున్నారు.