Friday, May 3, 2024
- Advertisement -

డిప్యూటీ మేయర్ పోస్ట్ ఎవరికి..?

- Advertisement -

ఆంధ్రోళ్ళ మనసులు గెలుచుకుని తిరుగులేని మెజారిటీ పొందిన తెరాస వారు ఇప్పుడు మరొక సంచలన నిర్ణయంతో ఆంధ్రా జనాల మనసులు దోచే దిశగా సాగుతున్నారు అని తెలుస్తోంది. మొన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన తెరాస ఇప్పుడు సీమాంధ్ర వ్యక్తి కి డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చే ప్లాన్ లో ఉంది అని తెలుస్తోంది.

డిప్యూటీ మేయర్ పోస్ట్ ని  సీమాంధ్ర నుంచి వచ్చిన సెటిలర్ల నుంచి ఎన్నికైన ఒక కార్పొరేటర్ కే కట్టబెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రా వారు అయినా తమిళ వారు అయినా అంతా తమ వారేనని కెసిఆర్ ప్రకటన చేసిన తరవాత తెరాస పట్ల జనాలకి ప్రేమ పెరిగింది. ఇదే సమయంలో ఆంధ్రా కార్పరేటర్ల కి కూడా భారీగా టికెట్ లు ఇచ్చింది. సో ఇదంతా కలిపి కెసిఆర్ కి బ్రహ్మరథం పట్టారు జనాలు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి ఇస్తే గనక వారు తమనీ తమ పార్టీనీ ఇంకా నెత్తిన పెట్టుకుంటారు అనేది కెసిఆర్ ఆలోచన గా తెలుస్తోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -