ఓటుకు నోటు కేసు వ్యవహారంలో చంద్రబాబు, కేసిఆర్ రాజీ అయ్యారని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గిందంటూ ఆరోపణలు జోరందుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, డీజీపీ అనురాగ్శర్మలు ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు.
ఈ కేసులో తాజా వివరాలు, తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఈ ముగ్గురు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. శుక్రవారం కోర్టుకి సమర్పించాల్సిన నివేదికలో ఎటువంటి అంశాలను పొందుపరచాలన్న దానిపై మంతనాలు జరిపినట్టు సమాచారం. ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. కానీ మీడియాలో చంద్రబాబు అరెస్ట్ విషయంపై మాట్లాడటానికి ఫాం హౌస్ దగ్గర భేటీ అయ్యారని ఈ భేటీ రహస్యం కాబట్టి ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ కేసులో ఎవరి ఊహాగానాలు వారివి అన్నట్లుగా అయిపోయింది.