Thursday, May 16, 2024
- Advertisement -

48 గంటల్లో సారీ చెప్పాలి

- Advertisement -

వైకాపా లో ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉన్న అంబటి రాంబాబు ఈ మధ్యన కాస్త సైలెంట్ గా ఉన్నారు. ఆయన ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివ రామకృష్ణ మీద ఆయన చేసిన వ్యాఖ్యాలకి గాను ఈ గోల జరుగుతోంది. తనకు ఏ మాత్రం సంబంధం లేని అంశాల మీద తన ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఆరోపణలు.. విమర్శలు చేయటంపై కోడెల శివరామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తనపై అరోఫణలు చేసిన అంబటి..గోపిరెడ్డిలు తక్షణమే క్షమాపణలు చెప్పాలని.. అందుకు 48 గంటలు మాత్రమే సమయం ఇస్తూ ఒక పత్రికాప్రకటన విడుదల చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.

రాజకీయాల్లో ఉన్నవారు.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలపై ఆరోపణలు.. విమర్శలు సహజమే. అదే సమయంలో తమపై వచ్చే ఆరోపణలు.. విమర్శలపై సీరియస్ కావటం.. వివరణ ఇవ్వటం మామూలే. కానీ.. 48 గంటల టైమిచ్చి ఈ లోపు సారీ చెప్పాలని లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పటం ఆసక్తికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -