Monday, April 29, 2024
- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిర్ణయం హర్షదాయకం

- Advertisement -

తనకు శాసనసభ్యునిగా అందే జీతం అంతా ప్రజాసంక్షేమానికే ఉపయోగిస్తానని, జీతం నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోనని  నెల్లూరు రూరల్‌ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి చెప్పారు.

ఐదేళ్లలో ప్రభుత్వం ద్వారా వచ్చే 60 లక్షల రూపాయల తన జీతం మొత్తాన్ని విద్యార్థులకు ఆర్థిక సాయం, తాగునీటి పునరుద్దరణ, ఖర్చు చేస్తానని తెలిపారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు ఆర్థిక సాయం .అందించాలని శ్రీధర్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
మరి ఎమ్మెల్యేగా తిరగడానికి,ఇతరత్రా ఖర్చులు ఉంటాయి కదా అంటే తాను వాటిని భరించుకోగల స్తోమత ఉందన్న అభిప్రాయానికి వచ్చానని అన్నారు. అందువల్లనే తాను తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని శ్రీధర్ రెడ్డి వివరించారు. శ్రీధర్ రెడ్డి నిర్ణయం హర్షదాయకం.ఇందుకు ఆయనను అబినందిద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -