ఏపీ- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎప్పటికీ ఆరని చిచ్చును రాజేసింది- విభజన. ఇప్పటికే ఏపీ ప్రజలు రాజధాని లేక నానా అవస్థలు పడుతున్నారు. అదంతా కేవలం కేసీఆర్ పనే అని అందరికీ తెలుసు. ఇప్పుడు కేసీఆర్ ఓ మహిళ పట్ల కుట్ర పూరితంగా వ్వవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ చేతిలో మోసపోయింది ఏపీకి చెందిన ఓ మహిళా ఎంపీ కావడం విశేషం.
అరకు ఎంపీ కొత్త పల్లి గీత తనకు చెందిన కొంత భూమిని తెలంగాణ ప్రభుత్వం కబ్జా చేసిందని ఆరోపించారు. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ రంజిత్ కుమార్ సైనీ, టీఎస్ ఐసీసీ ఎండీ నరసింహరెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు కబ్జా భూమికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు తన వద్ద ఉన్నా.. దౌర్జన్యంగా టీ-ప్రభుత్వం కబ్జా చేసిందని ఆరోపించారు.
కోర్టు నుంచి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం కబ్జా చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి రాజ్ సింగ్ ను కలిసి పిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు న్యాయం చేస్తామని ఇరువురు మాటిచ్చారని రేణుక ఓ సమావేశంలో తెలిపారు. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఎక్కువ అవుతోందని.. త్వరలోనే ప్రజలు బుద్ది చెప్పే రోజు వస్తోందని ఈ సందర్భంగా హెచ్చరించారు.