ఆ విందులో ఏకంగా 25 మేకలు బలయ్యాయి. 100 కోళ్లు బిరియానీ పళ్లెంలోకి వెళ్లాయి. వీటిని తిన్నవాళ్లంతా పెద్దోళ్లే. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేటర్లు.. ఒక రేంజు వాళ్లే అంతా. ప్రస్తుతం ఈ విషయంపై రచ్చ రచ్చ అవుతోంది. ఈనోటా ఆ నోటా పాకిపోయి అసలు ఎవరా ఎమ్మెల్యే అంటూ చర్చించుకుంటున్నారు.
డీటెయిల్స్లోకి వెళితే..ఇటీవలే అన్నాడీఎంకే ఎమ్మెల్యే పరమేశ్వరి తమిళనాట ఓ ప్రఖ్యాత దేవాలయంలో గ్రాండ్గా పార్టీ ఇచ్చారు. ఇది ఏ రేంజులో అంటే .. దివినుంచి ఇంద్రలోకం దిగివచ్చిందా? అనే రేంజులో సెలబ్రిటీలతో కళకళలాడిపోయింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మన్నానల్లూరు నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరపున గెలుపొందిన పరమేశ్వరి ఈ పార్టీ ఇచ్చారు.
అయితే ఇదంతా తాను మంత్రి పదవి ఆశించి చేస్తున్నదే అంటూ ముక్క-కక్క తిన్నవాళ్లే ప్రచారం చేయడంతో ఇపుడా వార్త దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. సట్టికరుప్పు అమ్మవారికి పాతిక మేకల్ని, 100 పైగా కోళ్లను బలి ఇచ్చి మరీ పదవిని కాంక్షిస్తున్నారు సదరు లేడీ ఎమ్మెల్యే .
Related