Friday, March 29, 2024
- Advertisement -

అబ్బాస్ కి భారీ జరిమానా..పిటిషన్​లో వాస్తవం లేదు..!

- Advertisement -

కరోనా మహమ్మారి లేదు. ప్రభుత్వం టీకా కొనుగోలుకు చేస్తున్న ప్రయత్నాలను ఆపాలంటూ పిటిషన్​ దాఖలు చేసిన ఓ వ్యక్తికి లాహోర్​ హైకోర్టు జరిమానా విధించింది. రూ. 2లక్షలు జరిమానా కట్టాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇటువంటి నిరాధార వ్యాజ్యాలను దాఖలు చేసేప్పుడు జాగ్రత్త వహించాలని హెచ్చరించింది.

కరోనా వైరస్ అనేది అంతర్జాతీయ కుట్రలో భాగమని… ఇది చేతులు కలపడం ద్వారా రాదని అబ్బాస్​ తన పిటిషన్​లో పేర్కొన్నాడు. కొన్ని దశాబ్దాలుగా కొవిడ్​ లక్షణాలు మనలో ఉన్నయని.. అవేమీ ప్రాణాంతకం కాదంటూ తన వాదన వినిపించారు. దీనిపై స్పందించిన లాహోర్​ హైకోర్టు.. మహమ్మారి లేదనేందుకు గల వైద్య పరమైన రుజువులు ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశించింది. ఇందుకు సమాధానంగా అబ్బాస్​ ఈ వైరస్​ ప్రపంచ వ్యాప్తంగా ఉండే ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన అంతర్జాతీయ కుట్ర అని వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఆ వాదనను పట్టించుకోని ధర్మాసనం రూ. 2 లక్షలు జరిమానా విధించింది.

అబ్బాస్​ వేసిన పిటిషన్​లో వాస్తవం లేదన్న న్యాయమూర్తి.. సమాజంలో గందరగోళం తలెత్తే వ్యాజ్యాలను దాఖలు చేసేప్పుడు జాగ్రత్త వహించాని హెచ్చరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -