- Advertisement -
అమర్నాథ్ యాత్రలో విషాధ సంఘటన చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా, 35 మందికి గాయాలయ్యాయి. జమ్ము జాతీయ రహదారిలో ఉన్న రంబన్ ప్రాంతంలోని నాచ్ నల్లా వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. బస్సు జమ్ము నుంచి పహెల్గాం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో మరొకరు మృతి చెందారు. 47 ఏళ్ల మహిళా యాత్రికురాలు లలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది.
గత వారం అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఎనిమిది మంది యాత్రికులు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది లష్కరే తోయిబా ఉగ్రవాదులేనని జమ్మూకశ్మీర్లో పోలీసులు వెల్లడించిన సంగతి విదితమే.