మహారాష్ట్ర నాగ్పుర్లో కరోనా కేసులను అరికట్టేందుకు లాక్డౌన్ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. ఫలితంగా.. ఈ నెల 15 నుంచి 21 వరకు కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయి. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.
పుణెలో కొవిడ్ రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయినప్పటికీ అక్కడ లాక్డౌన్ ఆంక్షలు అమల్లో లేవు. కానీ, రాత్రి వేళ కర్ఫ్యూ నిబంధనలు అమలు చేస్తోంది అక్కడి పాలనా యంత్రాంగం. మార్చి 14 వరకు పాఠశాలలు, కళాశాలల మూసివేత కొనసాగుతోంది. అయితే.. త్వరలోనే కఠిన నిబంధనలు అమలు చేస్తామని పుణె మేయర్ మురళీధర్ మొహోల్ తెలిపారు.
ఔరంగాబాద్లో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్న స్థానిక పాలనా యంత్రాంగం.. అక్కడ పాక్షిక లాక్డౌన్ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే దుకాణాలు, మార్కెట్లకు అనుమతించింది. వారాంతాల్లో అన్ని దుకాణాలు, మార్కెట్లు, హోటళ్లు మూసివేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇది అంతా దాని కోసమే.. రేవంత్ కామెంట్స్..!