విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగుల ఆందోళన ఉద్ధృతమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, పలు సంఘాలు పోరాడుతోన్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వారి ఉద్యమానికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదానికి తెలంగాణ కూడా పూర్తిగా మద్దతు ఇస్తుందని ఇక్కడి నాయకులు అంటున్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఏపీకి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతు తెలుపుతామని వెల్లడించారు. ఏపీ వాళ్లు కూడా తెలంగాణకు మద్దతుగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ ప్రైవేట్పరం చేసేలా ఉన్నారని విమర్శించారు.
దీంతో కేటీఆర్పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు. కేటీఆర్ చిత్రపటాలకు స్టీల్ ప్లాంట్ కార్మికులు, స్థానికులు పాలాభిషేకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతాకలిసి పోరాడి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చర్యలను అడ్డుకుంటామని కార్మికులు చెప్పారు.
‘సారంగ దరియా’ వివాదం.. శేఖర్ కమ్ముల ఏమన్నారో తెలుసా?