కొన్ని లక్షల కోట్లు రోడ్డున పడ్డాయ్. 500, 1000 నోట్లు రద్దు చేయడంతో… దేశంలో ఉన్న బడా బాబులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భద్రంగా దాచుకున్న కోట్లన్ని ఇప్పుడు బయట పడుతున్నాయి. లేక్కల్లోకి వెళితే అందుతున్న సమాచారం మేరకు.. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లోనే 26వేల కోట్లు కార్లలో, లారీలలో పరుగులు పెడుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత మొత్తంలో డబ్బులు చేతులు మారుతుంటే.
దేశం మొత్తం చూసుకుంటే కొన్ని లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి అనే చెప్పాలి. ఇదంతా అక్షరాలా బ్లాక్ మనీ. ప్రజల సొత్తు. ఏ నల్ల డబ్బు కారణంగా ఐతే కేంద్ర ప్రభుత్వం ఈ నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందో అదే నల్ల డబ్బు ఇప్పుడు దేశ రహదారుల్లో పరుగులు తీస్తుంది. దీనికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వ అధికారులకి ఈ విషయం తెలియదా? ACB అధికారులు ఏం చేస్తున్నారు? ఈ పారుతున్న కోట్లు కనక పట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం సదుద్దేశంతో తీసుకున్న ఈ నోట్ల రద్దు నిర్ణయానికి పరిపూర్ణత వస్తుంది. ప్రజలకు ఉపయోగాపడుతుంది.
Related