రెండోరోజు టీవీ9 కార్యాలయం వద్ద ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రవిప్రకాశ్ ఫోర్జరీ కేసు వివాదంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీవీ9 యాజమాన్యం సంస్థలో సమూల మార్పులకు కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానె టీవీ9 బోర్డు డైరెక్టర్లు సమావేశం అయి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే సీఈవో పదవినుంచి రవిప్రకాశ్ను తొలగించింది కొత్త యాజమాన్యం.
ఏబీసీఎల్ డైరెక్టర్ల బోర్డు. కొద్దిసేపటి క్రితం సమావేశమైన డైరెక్టర్లు.. రవి ప్రకాష్ను టీవీ9 సీఈవో పదవి నుంచి తొలగిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించారు. మరోవైపు గొట్టిపాటి సింగారావును సీవోవో (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్)గా నియమిస్తూ ఏబీసీఎస్ డైరెక్టర్లు బోర్డు తీర్మానం చేసింది. మహేంద్ర మిశ్రా టీవీ9 సీఈవోగా వెంటనే బాధ్యతలు తీసుకున్నారు.
మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఎడిటర్గా ఉన్నారు. అలాగే గొట్టిపాటి సింగారావు.. గతంలో మా టీవీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం 10 టీవీ సీఈవోగా ఉన్నారు గొట్టిపాటి సింగారావు.దీంతో, టీవీ9లో రవిప్రకాశ్ శకం అంతమైనట్టైంది.