Monday, May 13, 2024
- Advertisement -

గ్రామాన్ని అభివృద్ధి చేస్తా – మహేష్ బాబు

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు, ప్రిన్స్ మహేష్ బాబు బుర్రిపాలెంలో సందడి చేశారు. ఆయన స్వగ్రామం కూడా అయిన బుర్రిపాలెంలో ప్రజలకు విద్య, ఆరోగ్యం వంటి మొరుగుపరచడం కోసం అన్ని చర్యలు తీసుకుంటానని మహేష్ బాబు అన్నారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ఆదివారం నాడు మహేష్ బాబు పర్యటించారు.

ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్ధాపన చేశారు. మస్త్రష్ బాబు రాక సందర్భంగా బుర్రిపాలెంలో పటిష్టమైన బందోబస్తుఏర్పాటు చేశారు. ఏకంగా 70 బౌన్సర్లు ఈ భద్రతలో పాల్గొన్నారు. ఇక నుంచి తాను బుర్రిపాలెం తరచుగా వస్తూంటానని, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మహేష్ బాబు అన్నారు.

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామాన్ని కూడా మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. మహేష్ బాబు తన స్వగ్రామం రావడంతో బుల్లిపాలెంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్ధులతో పాటు పొరుగు గ్రామాలకు చెందిన వారు కూడా మహేష్ బాబును చూసేందుకు ఎగబడ్డారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -