Friday, March 29, 2024
- Advertisement -

ఆర్టీసీ బస్సు లో ఆత్మహత్య చేసుకున్నాడు

- Advertisement -

హైదరాబాద్ లోని లోకల్ ఆర్టీసీ బస్సు లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు నగరం లో సంచలనం  సృష్టిస్తోంది. ఈ సంఘటన కుకట్ పల్లి ఏరియా లో జరిగింది. జగద్గిరిగుట్ట శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్‌ జమీర్‌(36) స్థానికంగా చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటాడు.

సికిందరాబాద్ రాణీ గంజ్ డిపో కి చెందిన బస్సు నైట్ హాల్ట్ కోసం కూకట్ పల్లి బస్సు టెర్మినల్ వద్ద పార్క్ చేసి డ్రైవర్ రాజేందర్, కండక్టర్ జంగయ్య రెస్ట్ రూమ్ లో పడుకున్నారు. జమీర్ ఆ బస్సులోకి దూరి తాడుతో ఉరి వేసుకున్నాడు .

తెల్లవారు జామున బస్సు తీయడం కోసం వెళ్ళిన డ్రైవర్ ఇది చూసి షాక్ కి గురయ్యాడు, ఇలోగా కండక్టర్ చూసి పోలీసులకి సమాచారం అందించాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు.. జమీర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేపట్టారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -