Thursday, April 25, 2024
- Advertisement -

జియాన్‌ఘాకా .. 39 మంది భార్యలకు భర్త.. ఇంకా చనిపోలేదట.. ఈ ట్విస్ట్ ఏమిటి?

- Advertisement -

39 మందిని కట్టుకొని.. 90 మంది పిల్లలను కన్న జియాన్‌ఘాకా ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన చనిపోయినట్టు డాక్టర్లు సైతం ధ్రువీకరించారు. మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. అయితే జియాన్​ ఘాకా ఇంకా చనిపోలేదని ఆయన కుటుంబసభ్యులు అంటున్నారు. ఆయన నాడి కొట్టుకుంటుందని.. ఆయన శరీరం ఇంకా వెచ్చగానే ఉందని వారు వాదిస్తున్నారు. ఆదివారం ఆయన చనిపోయినప్పటికీ ఇంకా అంతిమ సంస్కారాలు నిర్వహించలేదు. ఆయన బతికే ఉన్నాడని వాళ్లు నమ్ముతున్నారు.

జియాన్‌ స్థానిక లాల్పా కోహ్రాన్‌ ధర్‌ తెగకు అధిపతి అన్న విషయం తెలిసిందే. ఆయన బీపీ, షుగర్​తో బాధపడుతున్నారు. అనారోగ్యంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు ట్రినిటీ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. కుటుంబసభ్యులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. లాల్పా కోహ్రాన్‌ ధర్‌ అనే తెగను జియాన్​ పూర్వికులు స్థాపించారు. వీరంతా 70 ఏళ్లుగా వడ్రంగి పనిచేస్తూ జీనవం సాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే జీయన్​ మరణవార్త ప్రపంచవ్యాప్తగా సంచలనంగా మారింది. గతంలో 39 మంది భార్యలను చేసుకున్న వ్యక్తిగా జియాన్​ రికార్డులకెక్కాడు. తాజాగా ఆయన మరణించారు. కుటుంబసభ్యులు మాత్రం ఇంకా బతికే ఉన్నాడని వాదిస్తున్నారు. అయితే ఆయనను మృతదేహాన్ని అలాగే ఉంచితే డీ కంపోజ్​ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. తమ తెగ పెద్దలు వచ్చి.. ఆయన మరణించాడని చెబితేనే తాము అంతిమ సంస్కారాలు చేస్తామని కుటంబసభ్యులు అంటున్నారు. ఏం జరగబోతుందో వేచి చూడాలి.

Also Read

జమ్మూ -కశ్మీర్​ మళ్లీ రాష్ట్రం కాబోతున్నదా?

కరోనాకు కాక్​టెయిల్​ అద్భుతంగా పనిచేస్తోందట..!

విశ్వాసం అంటే ఇదే..! యజమాని కోసం అంబులెన్స్​ వెంట కుక్క పరుగు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -