దేశవ్యాప్తంగా ఇవాళ 8 రాష్ర్టాల్లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. బెంగాల్లో పలు చోట్ల ఉద్రిక్తల మినహా ప్రశాంతంగా సాగుతోంది. ఈ విడత పోలింగ్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు సునీల్గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలు ముంబైలో ఓటు వేశారు.
బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అమితాబ్-జయా బచ్చన్, ఐష్-అభిషేక్ దంపతులు జుహూలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మరోవైపు సల్మాన్ఖాన్, కరీనాకపూర్ బాండ్రాలోని పోలింగ్ బూత్ నంబర్ 283 లో ఓటు వేశారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సెంటర్ 283లో ఆయన ఓటు వేశారు.
హీరో రణ్వీర్ సింగ్ తన తండ్రితో కలిసి బాంద్రాలో ఓటు వేశారు. హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ తన కుటుంబం సభ్యులతో కలసి ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు
సెలబ్రిటీలంతా ఓటేసిన అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద సిరా గుర్తును మీడియాకు చూపించారు. ఓటర్లంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తారలంతా విజ్ఞప్తి చేశారు.