పరీక్షలకు వెల్లిన విద్యార్థులు ఆన్సర్ పేపర్లో ప్రశ్నలకు జవాబులు రాయడం కామన్. కొన్ని సార్లు జవాబులకు బదులు సినిమాస్టోరీలు,బూతు పదాలు ,కవితలు రాయడం చూశాం.తాజాగా ఇలాంటి సంఘన ఉత్తరప్రదేశ్లోజరిగింది. ఆన్సర్ పేపర్లో రాసింది సినిమాస్టోరీ కాదండోయ్ ఏకంగా ఒ విద్యార్థిని పెల్లి ప్రపోజల్ రాయడంతో పేపర్లు దిద్దే టీచర్లు అవాక్యయ్యారు.
పరీక్షలో విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు.దీంతో మాల్ ప్రాక్టీస్కు పాల్పడే అవకాశ లేకపోవడంతో ఓ విద్యార్థిని వినూత్నంగా తనను పాస్ చేయాలని కోరింది. యూపీ బోర్డు ఎగ్జామ్స్ కు హాజరైన ఓ విద్యార్థిని తన ఆన్సర్ షీటులో పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చింది. సార్.. నేను ఓ అమ్మాయిని. వచ్చే జూన్ 28న నా వివాహం జరగనుంది. దయచేసి నన్ను ఈ పరీక్షల్లో పాస్ చేయండి. నేను ఫెయిల్ అయితే మా ఫ్యామిలీ చాలా బాధ పడుతుంది. నా పరిస్థితి అర్థం చేసుకోండి’ అంటూ యూపీ బోర్డు ఎగ్జామ్స్ లో ఓ విద్యార్థిని రాసుకొచ్చింది.
{loadmodule mod_custom,Side Ad 1}
తాను పెళ్లికి సిద్ధంగా ఉన్న సమయంలో పరీక్షలో ఫెయిల్ అయితే చిన్నచూపుగా ఉంటుందని చెబితే పాస్ చేస్తారని తన తెలివితేటలు చూపించింది అమ్మాయి. చదవకుండా ఎలాగైనా పాస్ కావాలనే ఉద్దేశంతో ఎగ్జామ్ బోర్డుకు ప్రతి ఏడాది ఇలాంటి సమాధాన పత్రాలు వేలాదిగా వస్తుంటాయని ఇలాంటివి మామూలేనని పేపర్లు దిద్దే ఉపాధ్యాయులు చెబుతున్నారు. గతంలో కొందరు విద్యార్థులైతే నేరుగా 50, 100, 500 నోట్లను ఆన్సర్ షీటుకు జతచేసి లంచం ఇవ్వజూపిన సందర్భాలు ఉన్నాయి.
రాను రాను విద్యార్థులకు పరీక్షలంటేనే లెక్కలేకుండా పోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా పరీక్షలను కట్టుదిట్టం చేయడంతో ఏం రాయాలో తెలియక వింతవింత సమాధానాలు రాస్తున్నారు. అయితే గతేడాది తరహా పరిస్థితి ఇప్పుడు లేదని…. చదువుతేనే అవుతారని, లంచం ఇవ్వచూపాలని చూసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఓ ఉన్నతాధికారి విద్యార్థులకు సూచించారు. వీరిని పాస్ చేసినా ఏ సబ్జెక్ట్ లేని కారణంగా ఉద్యోగాల వేటలోనూ వెనుకంజలో ఉండాల్సి వస్తుందంటున్నారు అధికారులు.
{loadmodule mod_sp_social,Follow Us}