ప్రస్తుతం ఎక్కడ చూసిన ఒకే ఒక్క సినిమా గురించి చర్చ.. అదే `మెర్సల్` గురించి. ఈ మూవీలో ఉన్న డైలాగులు రాజకీయగా ప్రకంపనాలు సృష్టించడంతో.. వివదాలు మొదలు అయ్యాయి. ప్రధానంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరుగుతోందో చెప్పే విదంగా డైలాగులు.. జీఎస్టీ వల్ల నష్టంను చూపిస్తూ డైలాగులు పెలాయి. ఇప్పుడు ఈ డైలాగులు ప్రభుత్వానికి ఎక్కడో తగిలాయి. దాంతీ బీజేపీ నాయకులు బరిలోకి దిగి హీరో విజయ్..పై ఎటాక్ చేశారు. అయితే అంతగా కదిలించిన డైలాగులు ఈ సినిమాలో ఏం ఉన్నాయో ఒక్కసారి చూద్దాం..
* ఇండియాలోని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కనీసం ఆక్సిజన్ సిలెండర్స్ కూడా ఉండవు.. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ సిలండర్లు లేకపోవడానికి కారణం? ఆక్సిజన్ సప్లయర్లకు రెండేళ్లుగా డబ్బులు చెల్లించలేని పరిస్థితిని ఎందుకు ప్రభుత్వ ఆస్పత్రులు ఎదుర్కొంటున్నాయి?
* సింగపూర్ ప్రజలు 7శాతం జీఎస్టీ కడుతున్నారు.. ఉచితంగా వైద్య సేవలు అందుకుంటున్నారు.. కాని భారత ప్రభుత్వం ప్రజలనుంచి 28శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. అయినా ఎందుకని ప్రజలందరికీ కనీసం ఉచిత వైద్యం అందించలేకపోతోంది?
* మెడిసిన్ మీద 12శాతం జీఎస్టీ కడుతున్నాం..లిక్కర్ మీద మాత్రం జీఎస్టీ లేనేలేదు.. ఎందుకిలా?
* ప్రభుత్వ హాస్పిటల్స్ లలో కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ చేస్తున్నప్పుడు పవర్ ఔటేజ్ సమస్య తలెత్తి నలుగురు రోగులు చనిపోయారు.. పవర్ సప్లై బ్యాకప్ లేక వీళ్లంతా చనిపోవడం ఎంతటి దౌర్భాగ్యం?
* ఇంక్యుబేటర్ లో ఉంచిన బేబీ ఎలుకలు కొరికి చనిపోవడమా?.. ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటేనే వణుకు పుట్టే పరిస్థితి వచ్చింది. ఆ భయమే ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుబడి సర్.. ..ఈ హత్యలన్నిటినీ మనం న్యాయమే అందామా? వీటిని హత్యలు అనకూడదా?