రాయ్చూర్: ఇటీవల చట్ట సభల్లో పలువురు నాయకులు అసభ్యకర వీడియోలు చూస్తూ దొరికిపోయిన పలు సందర్భలు మనం చూశాం. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన లీడర్లు ఫోన్లలో నీలి చిత్రాలు చూస్తూ తమకు నిబద్దత లేదని నిరూపించుకుంటూ ప్రజలు ఈసడించుకునేలా తయారౌతున్నారు.
అయితే తాజాగా కర్ణాటకలో విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్ తన ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ మీడియాకు దొరికిపోయాడు. టిప్పు జయంతి ఉత్సవాల సందర్భంగా రాయ్చూర్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి గారు ఈ నిర్వాకం చేస్తుండగా మీడియా కంట పడ్డారు.
అయితే ఈ దృశ్యాలు కాస్త టీవీల్లో ప్రచారమైపోయాయి. దీంతో కంగారుపడ్డ తన్వీర్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తాను మూడు నెలలుగా ఇంటిలో లేనని మొదట చెప్పినప్పటికీ తాను ముబైల్లో చూసింది వేరే వీడియో అని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించారట. అయితే ఈ చర్య ప్రస్తుతం ఆయన పదవికే ఎసరు తెచ్చింది. ఆయనపై ఎటువంటి చర్యలు ఉండనున్నాయనేది సీఎంపై ఉంది. అయితే పూర్తి సమాచారం అందిన తర్వాతనే తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం సిద్దిరామయ్య వెల్లడించారు.