Saturday, April 27, 2024
- Advertisement -

కరోనా ఉధృతిపై ప్రధాని మన్ కీ బాత్!

- Advertisement -

దేశంలో కరోనా కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. మొన్నటి వరకు వందలు వేల సంఖ్యలో కేసులు నమోదు అయితే ఇప్పుడు మూడు లక్షలకు పైగా చేరాయి. కరోనా కట్టడి చేయడానికి పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ ప్రకటించారు. తాజాగా నేడు రేడియో కార్య‌క్ర‌మం మ‌న్ కీ బాత్‌లో ఆయ‌న మాట్లాడుతూ… రెండో ద‌శలో క‌రోనా వేగంగా విస్త‌రిస్తోందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

రెండో ద‌శ క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో తాము తీసుకోవాల్సిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ఆక్సిజ‌న్, ఫార్మా కంపెనీల ప్ర‌తినిధులతో చ‌ర్చించామ‌ని తెలిపారు. ఇప్పటి వరకు 45 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ కేంద్ర స‌ర్కారు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపారు.

అర్హులంద‌రూ ఈ ఉచిత వ్యాక్సిన్ స‌దుపాయాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని చెప్పారు. రాష్ట్రాల ప్ర‌య‌త్నాల‌ను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర స‌ర్కారు స‌హ‌క‌రిస్తోంద‌ని తెలిపారు. సామాజిక మాధ్య‌మాల ద్వారా క‌రోనాపై వైద్యులు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డికి రాష్ట్రాల‌కు స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు.

దేశంలో లాక్ డౌన్ కొనసాగింపు టెన్షన్..?

నేటి పంచాంగం, ఆదివారం (25-04-2021)

కరోనాతో ఛస్తుంటే.. ఎంజాయ్ లో మునిగిపోతున్నారు.. బాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై న‌వాజ్ సీరియస్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -