స్ఫూర్తి ని రేకెత్తిస్తూ, పెద్ద మనిషి తరహా లో మాట్లాడ్డం నరేంద్ర మోడీ కి అలవాటే. ఎన్నికల టైం వచ్చేసరికి మోడీ టోన్ పూర్తిగా మారిపోయిని. తాజాగా ముంచుకుని వాస్తున్న ఉత్తరప్రదేస్ ఎన్నికల అసంబ్లీ వేడి లో మోడీ ఫక్తు పొలిటీషియన్ గా మారిపోయారు.
ఆయన లోని రాజకీయ నాయకుడు నిద్ర లేచాడు అన్నట్టుగా ఉంది ఆ ప్రసంగం .తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయటమే కాదు.. తమకు పోటీగా నిలిచే వారిపై మాటలతో మంట పుట్టించారు. ఫక్తు రాజకీయ నేతగా మోడీ చేసిన ప్రసంగాన్ని చూస్తే.. అవసరానికి తగ్గట్లు నేర్పు మోడీలో ఎంత ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.
అవినీతిపై.. నల్లధనంపై కేంద్రం చేపట్టిన చర్యల గురించి చెప్పుకోవటమే కాదు.. తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై మోడీ తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు.కేంద్రం పూర్తిగా మద్దుతు ప్రకటించినప్పటికీ యూపీ అధికారపక్షం అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన మోడీ.. తాజాగా జరగనున్న యూపీ ఎన్నికల్లో బీజేపీకి కానీ అధికారాన్ని కట్టబెడితే.. అభివృద్ధిని దౌడు తీయిస్తామని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మోడీ మాటలన్నీ ఫక్తు రాజకీయ నేతను తలపించేలా ఉండటం గమనార్హం.