Thursday, April 25, 2024
- Advertisement -

పైప్​లైన్​ను జాతికి అంకితమివ్వనున్న మోదీ..!

- Advertisement -

కేరళలోని కొచ్చి-మంగళూరు సహజ వాయువు పైప్​లైన్​ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్నారు. వర్చువల్​గా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు మోదీ. ఈ పైప్​లైన్​ ప్రాజెక్ట్.. ‘ఒకే దేశం- ఒకే గ్యాస్​ గ్రిడ్’ ఏర్పాటుకు మైలురాయి వంటిదని​ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఎర్నాకుళం, త్రిస్సూర్​, పాలక్కడ్​, మలప్పురం, కోజికోడ్​, కన్నూర్​, కాసర్​గోడ్​ మీదుగా.. 450 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్​లైన్​ను గెయిల్​(ఇండియా) లిమిటెడ్​ నిర్మించింది. ఈ మార్గం ద్వారా రోజుకు 1.20 కోట్ల మెట్రిక్​ ప్రామాణిక క్యూబిక్​ మీటర్ల రవాణా సామర్థ్యంతో కొచ్చి నుంచి మంగళూరుకు ఎల్​పీజీ(లిక్విఫైడ్​ నేచురల్​ గ్యాస్​)ను సరఫరా కానుంది. ఈ ప్రాజెక్ట్​ మొత్తం వ్యయం రూ.3వేల కోట్లు కాగా.. దీని వల్ల సుమారు 12లక్షల మంది ఉపాధి పొందినట్టు సమాచారం.

ఈ పైప్​లైన్​ ద్వారా పర్యావరణ రహిత, సరసమైన ఇంధనాన్ని పైప్డ్​ నేచురల్​ గ్యాస్​(పీఎన్​జీ) రూపంలో గృహాలకు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ)ను రవాణా రంగానికి సరఫరా చేయనున్నారు.

కేంద్రంతో పోరులో నేడు ఏడో విడత చర్చలు..!

అంతా తూచ్.. మళ్ళీ మేము ఫ్రెండ్స్..సింధియాకు ఆహ్వానం..!

మహేశ్ బాబు సినిమాలో పవన్ కల్యాణ్ మాజీ భార్య!

బీజేపీ భారీ స్కెచ్.. త్వరలో కేసీఆర్‌కు భారీ షాక్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -