- Advertisement -
నూతన సాగు చట్టాలపై ఢిల్లీలో జరుగుతున్న రైతన్నల పోరాటంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రైతులు- కేంద్రం మధ్య సోమవారం ఏడో విడత చర్చలు జరగనున్నాయి. ఈసారి జరిగే చర్చల్లో సానుకూల ఫలితం వస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారైనా తాము ఆశించిన ఫలితం దక్కకపోతే.. నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాలు తేల్చిచెప్పాయి.
దేశ రాజధానిలో అన్నదాతలు గత 39 రోజులుగా ఆందోళనలు తెలుపుతున్నారు. వర్షం, ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు. సాగు చట్టాలను రద్దు చేసేంతవరకు వెనకడుగు వేయమని స్పష్టం చేస్తున్నారు.