ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరిగే చిత్ర విచిత్రాలన్నీ మన కళ్ల ముందు ఉంచుతున్నారు. ఇలాంటి వింతలు అసలు భూమిపై జరుగుతాయా అన్న సందేహాలు కూడా కలుగుతుంటాయి. సాధారణంగా మనం కోతి చేష్ట గురించి వింటూనే ఉంటాం.. చూస్తుంటాం. తాజాగా తాజాగా ఓ కోతి ఢిల్లీ మెట్రో ట్రైన్లో ప్రయాణించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెట్రో ట్రైన్ ఎక్కిన కోతి అద్దంలో నుంచి ఢిల్లీ నగరంను చూస్తూ తెగ ఎంజాయ్ చేసింది. ఇక ట్రైన్లోని ఓ ప్యాసింజర్ వద్దకు వెళ్లి పక్కనే కాసేపు కూర్చోని టైంపాస్ చేసింది. అయితే కోతి చేసిన వింత బాగానే ఉన్నా ఎంతో పకట్బంధిగా ఉండే మెట్రో సెక్యూరిటీని దాటుకుని కోతి ఎలా ట్రైన్ ఎక్కిందన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ వ్యవహారంపై ఢిల్లీ మెట్రో అధికారులు, సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఒకవేళ ట్రైన్ లో అది బెదిరిపోయి ప్యాసింజర్లపై దాడి చేసి ఉంటే ఎవరు బాధ్యత తీసుకోవాలన్న విషయం పై సీరియస్ అయ్యారు. త్వరలోనే కోతి మెట్రో ట్రైన్ ఎక్కిన స్టేషన్ మేనేజ్మెంట్పై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అన్నారు. అయితే ఈ వీడియో మాత్రం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.