- Advertisement -

ఎవరెస్ట్​ శిఖరం తాజా ఎత్తు..!

- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా పేరొందిన మౌంట్​ ఎవరెస్ట్​.. తాజా ఎత్తును ప్రకటించనున్నట్లు తెలిపింది నేపాల్​. ఏడాది పాటు సర్వే చేసిన గణాంకాలపై డిసెంబర్​ 8న ప్రకటించనున్నట్లు ఆ దేశ సర్వే విభాగం అధికారులు మీడియాకు సమాచారం అందించారు.

2015లో వచ్చిన భూకంపంతో ఎవరెస్ట్​ ఎత్తు 8,848 నుంచి తగ్గిపోయిందన్న ఊహాగానాల నేపథ్యంలో సర్వే చేపట్టింది నేపాల్​. ఏడాది పాటు శిఖరం ఎత్తుపై సర్వే నిర్వహించారు అధికారులు. ఇందు కోసం చైనా సాయం తీసుకుంది. 2019లో చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ నేపాల్​ పర్యటన సందర్భంగా.. ఎవరెస్ట్​ కొత్త ఎత్తును సంయుక్తంగా ప్రకటించేందుకు ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

భారత సర్వే విభాగం 1954లో ఎవరెస్ట్​ ఎత్తును కొలిచి 8,848 మీటర్లుగా తేల్చింది. అప్పటి నుంచి అవే గణాంకాలు ప్రామాణికంగా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -