తాడి పత్రి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి . ఈయన ఏంమాట్లాడినా సంచలనమే… మాట్లాడేటప్పుడు అవతలి వారు ఎవరైనా సరే…. వెనుకా ముందూ అలోచించకుండా దుమ్ముదులిపేస్తారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతాడు. అది ఆయన నైజం.
ఏదో ప్రతిపక్షాలను మాట్లాడితే అది పార్టీలో భాగం. కానీ ఇప్పుడు జేపీ మాట్లాడింది ఎవరి గురించో తెలుసా.. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు,మంత్రి నారాయనలమీద సంచలన ఆరోపనలు చేశాడు. ఏకంగా ఇద్దరూ తోడు దొంగలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక అమరావతి అభివృద్దిపై సీఎం చంద్రబాబు,మంత్రి నారాయణలకు ఏమాత్రం అవగాహన లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి అభివృద్ది జరగాలంటే తన సలహాలు కూడా తీసుకోవాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇళ్లస్థలాలు ఇచ్చి బ్యాంకులతో ఒప్పందం చేస్తే..వారు త్వరగా ఇళ్లు కట్టుకుంటారని.. అప్పుడు యాక్టివిటీ పెరుగుతుందని జేసీ సలహా ఇచ్చారు. బ్యాంకులతో లింకులు పెట్టకుండా ఉంటే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ భూములను అమ్ముకుంటారని కూడా జేసీ చెప్పేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు దొంగల్లాంటివారని ఊరికే ఇస్తే అమ్మేసుకుంటారని చెప్పుకొచ్చారు.
అమరావతి త్వరగా అభివృద్ది చెందాలనీ చెప్పే నాయకులు ఉద్యోగులకు ఇళ్లు నిర్మించకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా ఉద్యోగులను అమరావతికి తరలించారీనీ ఆరోపించారు. వారికి అవగాహన లేకనే కేవలం భవంతులను నిర్మించి వదిలేశారని, దీనివల్ల అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని… వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఇళ్లు కూడ ఒక్కొక్కరికి ఒక కిలోమీటర్ దూరంలో నిర్మించాలని ఆయన మంత్రికి సూచించారు. దీంతో ఎమ్మెల్యేల మధ్య గొడవ లేకుంటా ఉంటుందన్నారు.
అయితే సొంత పార్టీ కి చెందిన ఒకా పార్లమెంట్ సభ్యుడి స్థానంలో ఉంటూ పార్టీ పరువును కాపాడాల్సింది పోయి, పార్టీ పరువును జేసీ ఎందుకు బజారుకు ఈడుస్తున్నారో మాత్రం తెలుగు తమ్ముళ్లకు అర్థం కావడంలేదు. అయితే జేసీ కామెంట్స్ పై బాబు గుర్రుగా ఉన్నట్లు మాత్రం తెలుస్తోంది. ఇలా సొంత్ పార్టీపై ఆరోపణలు చేసే వారికి తగిన బుద్ధి చెప్పాలని బాబు భావిస్తున్నట్లు అమాచారం. హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్నచంద్రబాబుకు అమరావతిని ఎలా అభివృద్ది చేయాలో తెలియదా జీసీ. మీదగ్గర సలహాలు తీసుకొనేంత స్తితిలో బాబుగారు ఉన్నారా.
Also Read