వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తాలో నిలిచే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు తాజాగా కోర్టు షాకిచ్చింది. ఆమెపై నమోదైన ఓ కేసుకు సంబంధించి ఏకంగా అరెస్టు వారెంట్ను జారీ చేసింది. వివరాళ్లోకెళ్తే.. బాలీవుడ్ సినీ రచయిత జావేద్ అక్తర్ కొన్ని నెలల కిందట కంగన రనౌత్ పై పరువు నష్టం దావా నమోదుచేశారు. ఈ కేసును అంధేరీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం విచారించింది.
ఈ క్రమంలోనే మార్చి 1న తమ ముందు హాజరు కావాలని కంగన రనౌత్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇచ్చిన గడువులోపు ఆమె న్యాయస్థానం ముందు హాజరు కాకపోవడంతో ఆగ్రహంచిన మెజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 26 (మార్చి 26)కు వాయిదా వేసింది. కాగా, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని కంగనా రనౌత్ తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్దికీ అన్నారు.
ఈ కేసుకు సంబంధించి అంధేరీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టులో సవాలు చేస్తామని రిజ్వాన్ స్పష్టం చేశారు. కాగా, బాంబే హైకోర్టుకు ఆ పై కోర్టుకు వెళ్లిన న్యాయస్థానం ముందు హాజరు కావడం నుంచి కంగన రనౌత్ తప్పించుకోలేరని రచయిత జావేద్ అక్తర్ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఈమెయిల్స్ సంబంధించిన కేసులో తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పై కంగనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..
‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అనసూయ
పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్