న్యూస్ రీడర్గా కెరియర్ ప్రారంభించి యాంకర్గా, యాక్టర్గా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమైన జబర్ధస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో తన అందం, అభినయంతో మస్తు క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి సినిమా అవకాశలు సైతం వచ్చాయి. దీంతో ఇటు బుల్లితెర అటు వెండితెరపై తన హవా కొనసాగిస్తోంది.
తాజాగా అనసూయ ‘పైన పటారం.. లోన లోటారం’ అంటోంది. ఎక్కడ? ఎందుకు అనుకుంటున్నారా? అదేనండి ఆమె నటిస్తున్న కొత్త సినిమాలో.. ! ‘చావు కబురు చల్లగా’ అనే సినిమాలో ఈ హాట్ బ్యూటీ అనసూయ ఓ పత్యేక గీతం (ఐటెం సాంగ్) చేస్తోంది. దీనిని సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ ఐటెం సాంగ్ ప్రొమోను విడుదల చేసింది. ఇందులో ఈ అమ్మడు తన అందాలతో అదరగొడుతూ.. పక్కా మాస్ తరహాలో ఉంది. దీంతో పూర్తి పాట కోసం ఎదురుచూస్తున్నామని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
కాగా, చవు కబురు చల్లగా సినిమాతో కౌశిక్ పెగళ్లపాటి నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇందులో కార్తికేయ, లావణ్య త్రిపాఠిలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాతగా గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై ఈ సినిమా రాబోతుంది. జేక్స్ బెజోయ్ చావు కబురు చల్లగా సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అనసూయ పైన పటారం లోన లోటారం ప్రోమో సాంగ్పై మీరు ఓ లుక్కెయండి మరి.. !
షాదీ ముబారక్ అంటున్న దిల్ రాజు !
‘అన్నాతే’ షూటింగ్ లో సూపర్ స్టార్ రజినీ