Monday, May 6, 2024
- Advertisement -

బాల‌కృష్ణ ఇంటిని ముట్ట‌డించిన పారిశుద్ధ్య కార్మికులు

- Advertisement -

అనంతపురం జిల్లా హిందూపురంలోని బాల‌కృష్ణ ఇంటి వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. 220 మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించడంతో ఆగ్రహించిన వారు బుధవారం బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. ఏపీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టేలా తెచ్చిన జీవో 279ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విధుల‌నుంచి తొల‌గించిన కార్మికుల‌ను వెంట‌నే విధుల్లోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

బాలకృష్ణ ఇంటి వద్ద పెద్ద ఎత్తున చెత్త వేసి వారు తమ నిరసన తెలిపారు. బాలకృష్ణ ఇంటిని కార్మికులు ముట్టడించడంతో పోలీసులు వారిని అడ్డుకొని ఈడ్చి పడేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు. కార్మికులతో పాటు సీఐటీయూ నేతలను బయటకు ఈడ్చిపడేశారు. అనంతరం ఆందోళనకారులను వ్యానులో పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -