Saturday, April 27, 2024
- Advertisement -

నగ్మా.. రొంబ తెలివమ్మా…

- Advertisement -

అందం.. అభినయం కలబోసిన నటి నగ్మా. ఏ భాషా చిత్రాల్లోనైనా విజయం సాధించిన నటి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. త్వరలో తమిళనాట జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శతవిధాల కృషి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మైలాపూర్ నుంచి శాసనసభకు పోటీ చేస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.

తాను పోటీ చేయాలనుకుంటున్నానని, అయితే ఇక్కడి తమ నాయకులు కొందరు మాత్రం తనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని మీడియా మిత్రులకు చెప్పారు. అంతే కాదు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంగీకరిస్తు తాను పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. తనకు తమిళనాట ఓటు లేదని, అయినా పోటీకి సిద్ధమేనని అంటున్నారు నగ్మా.

తమిళనాడులో డిఎంకె, కాంగ్రెస్ లది మంచి కూటమి అంటున్న నగ్మా తన పోటీపై మాత్రం కాంగ్రెస్ అగ్ర నాయకులదే చివరి తీర్పు అని భారం వారి మీదే వేశారు. అధిష్టానం ముద్ర వేస్తే ఇక తనను అడ్డుకునేది ఎవరని నగ్మా ఆలోచన. అమ్మో.. ఏమో అనుకున్నాం కాని నటిగా కంటే కూడా రాజకీయ నాయకురాలిగా ఎక్కువ మార్కులు వేయించుకుంటోంది నగ్మా. అందుకే తమిళ ప్రజలు.. నగ్మా.. రొంబ తెలివమ్మా అంటున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -