తెలంగాణా ప్రభుత్వం మొదలు పెట్టిన హరిత హారం కార్యక్రమం చాలా ప్రముఖంగా సాగుతోంది. కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి వేలాదిగా జనాలు తరలి వచ్చి మొక్కలు నాటుతూ ఉండడం విశేషం.
ఎమ్మెల్యే లూ, మినిస్టర్ లూ అనే తేడా లేకుండా బందోభస్తు కూడా పక్కన పెట్టి ఈ పనిలో పడ్డారు అందరూ. ఈ కార్యక్రమానిని విజయవంతం చెయ్యడం కోసం సెలబ్రిటీ లు కూడా రావడం విశేషం గా చెబుతున్నారు. చిరంజీవి నుంచి సంపూర్నేష్ బాబు దాకా అందరూ ఈ ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేసారు. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
ప్రతీ ఒక్కరూ తమ ఇంట్లో పరిసరాల్లోనో మొక్కలు నాటేసి హరితహారంలో పాల్గొంటే.. ఈమె మాత్రం డిఫరెంట్ రూట్ ను ఎంచుకుంది. మహేష్ బాబు తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు మండలంలో సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. సిద్ధాపూర్ లో పర్యటించిన నమ్రత.. అక్కడ హరితహారంలో పాల్గొని.. గ్రామస్తుల్లో స్ఫూర్తి నింపింది. సో మహేష్, ప్రభాస్ ల మీద కామెంట్స్ చేసిన చెర్రీ!సపోర్ట్ కెసిఆర్ కి పూర్తిగా ఉంది అని రాజకీయ వర్గాలు దీనికి కొత్త నానుడి చెబుతున్నాయి.
Related